వజ్రాల కోసం నడిరోడ్డుపై వెతుకులాట

వజ్రాల కోసం నడిరోడ్డుపై వెతుకులాట

ముద్ర, తెలంగాణ బ్యూరో : గుజరాత్‌ రాష్ట్రం సూరత్‌ లోని వరచ్చా ప్రాంతం వజ్రాల క్రయ, విక్రయాలకు ప్రసిద్ధి గాంచింది. ఈ క్రమంలో ఓ వ్యాపారి పొరపాటున వజ్రాల ప్యాకెట్‌ను రోడ్డుపై పడేసుకున్నట్లు ఓ వార్త స్థానికంగా వైరల్‌ అయ్యింది. దీంతో నడిరోడ్డుపై పడిపోయిన ఆ మూటలో రూ.కోట్లు విలువ చేసే వజ్రాలు ఉన్నట్లు ఓ మెసేజ్‌ చక్కర్లు కొట్టింది. ఇది తెలుసుకున్న ప్రజలు ఆ ప్రాంతానికి చేరుకుని నడిరోడ్డుపై వజ్రాల కోసం వేట మొదలు పెట్టారు. రోడ్డుపై అనువనువూ గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో ఆ ప్రాంతమంతా జనాలతో రద్దీగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్‌ అవుతోంది.