మళ్లీ లాక్ డౌన్...?
కొవిడ్ బీఎఫ్ 7 వేరియంట్ ప్రజల్లో కలవరం సృష్టిస్తోంది. కరోనా తగ్గి పోయింది అనుకునేలోపే మళ్లీ విజృంభన మొదలైంది. ఇప్పటికే ఈ వేరియంట్ విజృంభనతో చైనాలో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందడంతో చైనాలో లాక్ డౌన్ విధించారు. అంతే కాకుండా జపాన్, దక్షిణ కొరియా, హాంకాంగ్ లో కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి.దీంతో భారత్ అప్రమత్తమైంది. రాష్ట్రాలు కోవిడ్ నిబంధనలు పాటించాలి, జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేశారు.ఇతర దేశాల నుంచి ఇండియాకు వచ్చేవారికి కొవిడ్ నెగిటివ్ రిపోర్ట్ తప్పనిసరి చేసింది. అలాగే ఎయిర్ పోర్టులో ప్రయాణికులకు ఆర్టీపీసీ ఆర్ టెస్ట్ చేస్తూ.. లక్షణాలు కనిపించిన వారిని క్వారంటైన్లో ఉంచుతున్నారు.
భారతదేశంలో ప్రస్తుతం లాక్ డౌన్ విధించాల్సిన అవసరం లేదంట. కరోనా మళ్లీ భయపెడుతోంది. చైనాలో కేసులు తీవ్రతరం అవుతున్నాయి. అక్కడ కోవిడ్ విజృంభిస్తుండటంతో భారత్ అప్రమత్తమైంది. అన్ని రాష్ట్రాలకు కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ నేపథ్యంలో చైనాలో డిసెంబర్ మొదటి 20 రోజుల్లోనే 25 కోట్ల మంది ప్రజలు కరోనా బారిన పడినట్లు తెలుస్తోంది. మహమ్మారి ప్రారంభం నుండి కరోనా డేటాను దాచిపెట్టిన చైనా రహస్య నివేదిక ఈసారి లీక్ అయింది. చైనా ఆరోగ్య సంస్థ ‘ఎన్హెచ్సి’ సమావేశం నుండి లీక్ అయిన పత్రాలను చూసినట్లు అమెరికన్ న్యూస్ ఛానెల్ సిఎన్ఎన్ పేర్కొంది. జిన్పింగ్ ప్రభుత్వ రహస్య డేటా లీక్ కావడంతో చైనాలో కలకలం రేగింది. చైనాలో కరోనా ఎంత విధ్వంసం సృష్టించిందో లీక్ అయిన నివేదికను బట్టి అంచనా వేయవచ్చు. కరోనాతో చైనా పరిస్థితి దారుణంగా మారింది. చైనా ఆరోగ్య శాఖ డిసెంబర్ మొదటి 20 రోజుల్లో 250 మిలియన్లకు బదులుగా 62,592 కొత్త కోవిడ్ కేసులను మాత్రమే నివేదించిందని సీఎన్ఎన్ తెలిపింది.బ్లూమ్బెర్గ్, ఫైనాన్షియల్ టైమ్స్ నివేదికల ప్రకారం, డిసెంబర్ మొదటి 20 రోజుల్లోనే చైనాలో దాదాపు 250 మిలియన్లు మంది ప్రజలు కోవిడ్ బారిన పడవచ్చని చైనా ఉన్నత ఆరోగ్య అధికారులు అంతర్గతంగా అంచనా వేసింది. ఈ గణాంకాలు బుధవారం చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ అంతర్గత సమావేశంలో సమర్పించబడ్డాయి.
ఈ గణాంకాలు సరైనవే అయితే, 140 కోట్ల జనాభా ఉన్న చైనాలో 18 శాతానికి పైగా ప్రజలు కోవిడ్ బారిన పడ్డారని అర్థం. ప్రపంచంలోని ఏ దేశం నుండి కోవిడ్ సోకిన వారి సంఖ్య కంటే ఇది ఎక్కువ.ఫైనాన్షియల్ టైమ్స్, బ్లూమ్బెర్గ్ అధికారులు జరిపిన చర్చలను వివరించాయి. చైనాలో మంగళవారం మాత్రమే 3 కోట్ల 70 లక్షల మంది కోవిడ్ పాజిటివ్గా ఉన్నట్లు రెండు విూడియాలు తమ నివేదికలలో వెల్లడిరచాయి. అయితే చైనా ప్రభుత్వం మరోసారి డేటాను తారుమారు చేసింది. ఆ రోజు చైనా అధికారికంగా 3,049 కేసులను మాత్రమే నమోదు చేసింది. డిసెంబర్లో కరోనా వ్యాప్తికి అతిపెద్ద కారణం చైనాలో గత మూడేళ్లుగా అనుసరిస్తున్న జీరో కోవిడ్ విధానాన్ని అకస్మాత్తుగా రద్దు చేయడమేనని అంటున్నారు. అయితే ఇక్కడ ఎన్హెచ్సీ సమావేశం నుండి లీక్ అయిన పత్రాల గురించి ఇమెయిల్ పంపడం ద్వారా చైనీస్ ఆరోగ్య శాఖ వైపు నుంచి తెలుసుకోవడానికి ప్రయత్నించినట్లు సీఎన్ఎన్ పేర్కొంది. అయితే ప్రస్తుతానికి చైనా నుండి ఎటువంటి స్పందన రాలేదని పేర్కొంది.ఆరోగ్య శాఖ అధికారులతో జరిగిన సమావేశంలో ఎన్హెచ్సి డిప్యూటీ డైరెక్టర్ సన్ యాంగ్ ఈ గణాంకాలను సమర్పించారని ఫైనాన్షియల్ టైమ్స్ తన నివేదికలో పేర్కొంది. ఈ సమావేశంలోని వివరాలు రహస్యంగా ఉంచేందుకు ప్రయత్నాంచారని, దీని గురించి తెలిసిన ఇద్దరు అధికారులు తమకు పత్రాలు ఇచ్చారని ఫైనాన్షియల్ టైమ్స్ పేర్కొంది.కోవిడ్ మరణానికి గల కారణాలను ఇప్పుడు అప్డేట్ చేసినట్లు చైనా ఆరోగ్య అధికారులు తెలిపారు.
చైనా ప్రభుత్వం కొత్త సూచనల ప్రకారం, న్యుమోనియా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కారణంగా మరణాలు మాత్రమే కోవిడ్ మరణాలుగా పరిగణించబడతాయి. చైనాలో కోవిడ్ సంక్రమణ రేటు ఇంకా పెరుగుతోందని, బీజింగ్, సిచువాన్లలో జనాభాలో సగానికి పైగా కరోనా బారిన పడ్డారని సన్ యాంగ్ సమావేశంలో చెప్పారని ఫైనాన్షియల్ టైమ్స్ పేర్కొంది.కోవిడ్కు సంబంధించి చైనా ఇప్పటికే తప్పుడు గణాంకాలను చూపుతోందని, ఇప్పుడు ఆ సమాచారాన్ని కూడా ఇవ్వడం మానేసింది. అక్కడ కోవిడ్ పరీక్ష బూత్లు కూడా మూసివేయబడ్డాయి. జీరో కోవిడ్ విధానానికి వ్యతిరేకంగా ప్రజల ఆగ్రహం చెలరేగడంతో జి జిన్పింగ్ అలాంటి చర్య తీసుకున్నారు. అధికారికంగా చైనా డిసెంబర్లో ఎనిమిది కోవిడ్ మరణాలను మాత్రమే నివేదించింది. అయితే అసలైన గణాంకాలను చూస్తే వేలల్లో ఉన్నాయి.అయితే కొన్ని దేశాలలో కేసులు పెరుగుతున్నందువల్ల భారతదేశంలో కూడా పటిష్టమైన నిగా మరియు జాగ్రత్తలు తీసుకోకపోతే లాక్ డౌన్ ఖచ్చితమే అని నిపుణులు చెబుతున్నారు. ఇతర దేశాల నుంచి భారత్కు వచ్చేవారిపై ప్రత్యేక నిఘా ఉంచాలని లేని యెడల భారత్కు కరోనా ముప్పు తప్పదంటున్నారు నిపుణులు.