పోలీసు వలయంలో తిరుమలగిరి తెలంగాణ చౌరస్తా

పోలీసు వలయంలో తిరుమలగిరి తెలంగాణ చౌరస్తా

ముద్ర, తిరుమలగిరి: తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలోని బుధ వారం నాడు అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో జరపతలపెట్టిన నిరసన ధర్నా బైక్ ర్యాలీ కార్యక్రమానికి అనుమతి లేనందున ఎవరు ఎలాంటి ఆందోళన కార్యక్రమాలు నిర్వహించకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ముందస్తుగా జిఎంపిఎస్ జిల్లా అధ్యక్షులు కడెం లింగయ్య. ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షుడు కందుకూరి అంబేద్కర్ ను పోలీసులు  తెల్లవారుజామున ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కేంద్రంలో వందమంది కానిస్టేబుళ్లు ఐదుగురు సిఐలు 10 మంది ఎస్ఐలతో పాటు స్పెషల్ ఫోర్స్ తో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో ఈ ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది  క్షణాన ఏం జరుగుతుందోనని ప్రజలు భయాందోళన చెందుతున్నారు ఈరోజు తిరుమలగిరిలో సంత జరుగుతున్నందు వలన వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు వ్యాపారులు కూడా ఆందోళన చెందుతున్నారు