కర్షక విరోధి కాంగ్రెస్..
![కర్షక విరోధి కాంగ్రెస్..](https://mudranews.in/uploads/images/2023/10/image_750x_653b718d1be08.jpg)
ముద్ర, గంభీరావుపేట : రైతులకు సంక్షేమ పథకాలు అందకుండా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా వ్యవహరిస్తు నన్నదని ఎంపిపి వంగ కరుణ, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాపగారి వెంకటస్వామి గౌడ్ అన్నారు.ఎన్నికల కోడ్ నేపథ్యంలో రైతుబంధు డబ్బులు అంద జేతను నిలిపివేయాలని ఎన్నికల కమిషన్ కీ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం గంభీరావుపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మను బీఆర్ఎస్ నాయకులు దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు సంబంధించి రైతుబంధు డబ్బులను రైతులకు ఇవ్వద్దంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఢిల్లీలోని ఈసీకి ఫిర్యాదు చేయడం శోచనీయమన్నారు. దీంతో రైతాంగంపై కాంగ్రెస్ కపట ప్రేమ బట్టబయలైందన్నారు. రైతులకు పంట పెట్టుబడికి ఉపయోగపడే రైతుబంధును కాంగ్రెస్ పార్టీ ఆపాలని చూడడం సరైంది కాదన్నారు.రైతులకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు, రైతులు జరగబోయే ఎన్నికల్లో గుణపాఠం చెబుతారని అన్నారు. ఈ కార్యక్రమం లో సర్పంచ్ కటకం శ్రీధర్ పంతులు, సెస్ డైరెక్టర్ నారాయణ రావు, జడ్పీ కో ఆప్షన్ హైమద్, ఏఎంసి వైస్ చైర్మన్ లింగం యాదవ్,ఉప సర్పంచ్ నాగరాజు, నాయకులు లక్ష్మణ్, దయాకర్ రావు, రాజారాం, శ్రీమతి, లత,సురేందర్ రెడ్డి,రామాంజనేయులు గౌడ్, గాంధ్యడపు రాజు,సంజీవ్, బిక్షపతి సుమన్ యాదవ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.