పార్టీ గెలుపుకు కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలి : కుంభం
![పార్టీ గెలుపుకు కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలి : కుంభం](https://mudranews.in/uploads/images/2023/06/image_750x_64847734284ae.jpg)
ముద్ర ప్రతినిధి భువనగిరి : రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని డిసిసి జిల్లా అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం స్థానిక రహదారి బంగ్లాలో కాంగ్రెస్ పార్టీ ఓబీసీ జిల్లా కార్యవర్గ సమావేశంలో కుంభం మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే శక్తి వంచన లేకుండా పని చేయాలన్నారు. ఓబీసీ జిల్లా అధ్యక్షులు గోదా రాహుల్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బీసిలకు పెద్దపీట వేస్తుందని అన్నారు. పట్టణ కాంగ్రెస్ పార్టీ ఓబిసి అధ్యక్షునిగా గాజుల కుమార్ కు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఓబిసి కోఆర్డినేటర్ బెండ శ్రీకాంత్, జిల్లా ఉపాధ్యక్షులు మల్లేష్ పాల్గొన్నారు.