510 కిలో గంజాయి స్వాధీనం
![510 కిలో గంజాయి స్వాధీనం](https://mudranews.in/uploads/images/2023/12/image_750x_657325019cc2e.jpg)
ఇద్దరు పెడ్లర్లు అరెస్టు
ముద్ర, తెలంగాణ బ్యూరో : రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కోటీ ఇరవై లక్షల విలువైన 510 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇద్దరు ఫెడ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా రాచకొండ పోలీస్ కమిషనర్ చౌహాన్ మీడియాతో మాట్లాడుతూ.. మేడిపల్లి వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒడిస్సా నుంచి హైదరాబాద్ మీదుగా హర్యానాకు గంజాయి తరలిస్తున్న ఇద్దరు పెడ్లర్లు పట్టుబడ్డారని తెలిపారు. సరఫరాదారుడు ఒడిస్సాకు చెందిన వ్యక్తి కాగా, రిసీవర్ హర్యానాకు చెందిన వాడిగా గుర్తించామన్నారు. అలాగే జమ్మూకాశ్మీర్ కు చెందిన మనోహర్, హర్యానాకు చెందిన ప్రవీణ్ లను అరెస్టు చేశామన్నారు. రిసీవర్ ను అదుపులోకి తీసుకుంటే మరింత సమాచారం తెలిసే అవకాశం ఉందని ఆయన చెప్పారు.