మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ మహిళా నేత
![మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ మహిళా నేత](https://mudranews.in/uploads/images/2023/05/image_750x_6466401d9ea52.jpg)
సిద్దిపేట : ముద్ర ప్రతినిధి సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం కొండాపూర్ గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతూ గుండం ఉమారాణి చనిపోగా ఆమె కుటుంబాన్ని గురువారం నాడు దుబ్బాక నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ నాయకురాలు కత్తి కార్తీకగౌడ్ పరామర్శించారు.ఆడిటర్ గా గుండం బాల్రెడ్డి సతీమణి ఉమారాణి మూడు రోజుల క్రితం మృతి చెందింది.విషయం తెలుసుకున్న కార్తీక గౌడ్ బాల్రెడ్డిని వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ఉమారాణి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు గుండం మల్లారెడ్డి ఆయన సతీమణి బ్లాక్ కాంగ్రెస్ ప్రసిడెంట్ కొత్త దేవి రెడ్డి ,ఐరేని సాయితేజ గౌడ్,తదితరులు పాల్గొన్నారు.