హాస్టల్ విద్యార్థుల సమస్యల పరిష్కరించాలని కలెక్టరేట్ ఎదుట ఏఐఎస్ఎఫ్ ధర్నా
![హాస్టల్ విద్యార్థుల సమస్యల పరిష్కరించాలని కలెక్టరేట్ ఎదుట ఏఐఎస్ఎఫ్ ధర్నా](https://mudranews.in/uploads/images/2023/02/image_750x_63ef72c4086a2.jpg)
ముద్ర ప్రతినిధి, జగిత్యాల: హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అఖిలభారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. జిల్లా కార్యదర్శి అక్రమ్ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో బాలికల బీసీ హాస్టల్లో అధిక సంఖ్యలో విద్యార్థులు ఉన్నారని వారికి సరిపడ గదులు లేవని అదనపు హాస్టల్స్ ఏర్పాటు చేయాలని ఇరుకు గదులలో విద్యను అభ్యసిస్తున్నారు అదనపు హాస్టల్ లేకపోవడం వల్ల పేద విద్యార్థులకు హాస్టల్ విద్య అందని ద్రాక్షగా మిగిలిపోయింది అన్నారు జిల్లాలో అధికారులు మారుతున్న విద్యార్థుల సమస్యలు మాత్రం మారడం లేదన్నారు.
అనంతరం అదనపు కలెక్టర్ మంద మకరందు విద్యార్థులు వినతిపత్రాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఉపాధ్యక్షులు సంజయ్, సహాయ కార్యదర్శి వంశీ, నాయకులు మహేందర్, వినోద్, పవన్, రాహుల్, అంజలి, గౌతమి, సుచిత్ర, రచన, తిరుమల, అక్షయ, నితిష విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.