జీరో డౌన్​పేమెంట్​పై  ఏథర్​ స్కూటర్​

జీరో డౌన్​పేమెంట్​పై  ఏథర్​ స్కూటర్​

ముంబై: ఒక్క రూపాయి చెల్లించకుండానే జీరో డౌన్‌పేమెంట్‌తో ఏథర్​ఎనర్జీ కంపెనీ ఎలక్ర్టిక్​ స్కూటర్​ను అందిస్తోంది. ఈ స్కూటర్ పై రూ. 4500 క్యాష్​బ్యాక్​కూడా అందిస్తోంది. ఈ స్కూటర్​ కొనుగోలుకు సంబంధించి ఏథర్​ సంస్థ పలు వివరాలను వెల్లడించింది. ఆన్ రోడ్ ధరకు సమానమైన మొత్తాన్ని ఫైనాన్స్ రూపంలో లోన్ తీసుకోవచ్చు. ఫైనాన్స్ కంపెనీలు, బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ సంస్థల భాగస్వామ్యం ఏర్పాటు చేసుకున్నట్లు ఏథర్ ఎనర్జీ తెలిపింది. కంపెనీ ఇప్పటికే ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, హీరో ఫిన్‌కార్ఫ్, చోళ మండల ఫైనాన్స్ వంటి వాటితో ఒప్పందం చేసుకుంది. ఏథర్ స్కూటర్ కొనాలనుకుంటే మీకు 100 శాతం ఫైనాన్స్ లభిస్తుంది. అలాగే 60 నెలల వరకు టెన్యూర్‌తో మీరు లోన్ తీసుకోవచ్చు. వివిధ బ్యాంకులు ఈ మేరకు లోన్ ఆఫర్ చేస్తున్నాయి. ఏథర్ స్కూటర్ కొనుగోలుపై నెలవారీ ఈఎంఐ రూ.2999 నుంచి ప్రారంభమవుతుంది.

ఏథర్ ఎనర్జీ కంపెనీ ఆగస్టు 3న కొత్త ఈ–-స్కూటర్​ను లాంచ్​ చేయనుంది. 450 ఎస్ పేరుతో మార్కెట్లోకి ఈ స్కూటర్ ఎంట్రీ ఇవ్వబోతోంది.ఏథర్ ఎనర్జీ 450ఎస్ స్కూటర్ విషయానికి వస్తే.. 100 కిలోమీటర్లకు పైగా వెళ్లొచ్చు. టాప్ స్పీడ్ గంటకు 90 కిలోమీటర్లు. హోమ్ చార్జర్, పోర్టబుల్ చార్జర్, ఫాస్ట్ చార్జర్ అనే ఆప్షన్లు ఉన్నాయి. ధర రూ. 1.29 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. అలాగే మీరు ఎక్స్చేంజ్ ఆఫర్‌లో స్కూటర్ కొంటే జీరో డౌన్ పేమెంట్ పొందవచ్చు. అలాగే ఎక్స్చేంజ్ ఆఫర్ కింద రూ. 5 వేల ఎక్స్చేంజ్ బోనస్ పొందవచ్చు. ఐదేళ్ల వరకు లోన్ తీసుకుంటే తొలి ఈఎంఐ రూ. 4 వేల 500 వరకు క్యాష్ బ్యాక్ రూపంలో లభిస్తుంది. ఈ ఆఫర్ ఈ నెల ఆఖరు అంటే జూలై 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని కంపెనీ వెల్లడించింది.