మత్స్య శాఖ అడహక్ కమిటీ నియామకం

మత్స్య శాఖ అడహక్ కమిటీ నియామకం

ముద్ర ప్రతినిధి, సూర్యాపేట: జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అడహక్ కమిటీ ని గురువారం నాడు జిల్లా మత్స్య శాఖ అధికారి కార్యాలయం వద్ద జరిగిన  మత్స్య శాఖ సంఘాల సమావేశంలో  జిల్లా మత్స్య శాఖ అధికారి రూపేందర్ సింగ్  ప్రకటించారు. తొంభై రోజుల పాటు పదవిలో వుండే అడహక్ కమిటీ కి  సభ్యులు తమ అంగీకారం తెలిపారు. అడహక్ కమిటీ డైరెక్టర్ లుగా  బైరబోయిన శ్రీనివాస్, సారగండ్ల కోటయ్య, భాషబోయిన చంద్రయ్య, మామిడి విజయ్ కుమార్, మైసా శ్రీనివాస్, దొప్ప లింగ శేషయ్య, కాకి సీతారాములు, పిట్టల నగేష్, యామిని వీరయ్య, బ్రహ్మం, ఎన్. వెంకయ్య లను అడహక్ కమిటీ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కమిటీ పదవి కాలం తరువాత ఐదు సంవత్సరాల కాలపరిమితి గల  కమిటీని ఎన్నుకుంటారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ మహా సభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుండ్లపల్లి శ్రీను, జిల్లా అధ్యక్షులు ఈదుల యాదగిరి, బిఆర్ ఎస్ పార్టీ జిల్లా నాయకులు ఆకుల లవకుశ, తదితరులు పాల్గొన్నారు.