పోచమ్మకు ఘనంగా చలి బోనాలు | Mudra News

పోచమ్మకు ఘనంగా చలి బోనాలు | Mudra News

ముద్ర,ఎల్లారెడ్డిపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని స్థానిక పోచమ్మ ఆలయం లో గురువారం పిల్లా పాపలు బాగుండాలని పాడి పంటలు కాపాడాలని గ్రామస్తులందరూ సల్లంగా ఉండాలని ఆనవాయితీగా వస్తున్న ఆచారం ప్రతి సంవత్సరం గ్రామ దేవతలకు ఇష్టమైన చలి బోనాలను సమర్పించారు. నిత్య పూజ  నిర్వహణ కార్యక్రమాలను స్థానిక విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో  గ్రామస్తుల నిర్ణయం మేరకు నిర్వహిస్తున్నారు.ఆ సంఘం మహిళలు అదేవిధంగా కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో మహిళలు చలి బోనాల ను పోచమ్మ తల్లికి సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి, ఎంపీటీసీ సభ్యురాలు ఎనుగందుల అనసూయ, బిఆర్ఎస్ పార్టీ  పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి, వార్డు సభ్యులు పందిల్ల శ్రీనివాస్ గౌడు ,బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎలుగందుల నర్సింలు పోచమ్మ తల్లి ఆలయానికి వెళ్ళి మొక్కులు  చెల్లించుకున్నారు అనంతరం తీర్థప్రసాదాలను స్వీకరించారు.