బీ ఆర్ ఎస్ ప్రభుత్వ హయాంలో ఆలయాల అభివృద్ధి
![బీ ఆర్ ఎస్ ప్రభుత్వ హయాంలో ఆలయాల అభివృద్ధి](https://mudranews.in/uploads/images/2023/02/image_750x_63ea28fb10c53.jpg)
ముద్ర ప్రతినిధి, జగిత్యాల: బీ ఆర్ ఎస్ ప్రభుత్వం హయాంలో ఆలయాల అభివృద్ధి జరుగుతుందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. సారంగపూర్ మండలం దుబ్బ రాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఎమ్మెల్యే మాట్లాడారు.
సందర్భంగా ఎమ్మెల్యే ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం జడ్పీ చైర్పర్సన్ దావ వసంత జన్మదిన పురస్కరించుకొని ఆలయ ఆవరణలో కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాల చైర్మన్ చంద్రశేఖర్ గౌడ్, కోల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.