అంజన్న సన్నిధిలో పోటేత్తిన భక్తులు

అంజన్న సన్నిధిలో పోటేత్తిన భక్తులు

భారి వర్షానికి కూలిన చలువ పందిళ్ళు 
ముద్ర, మల్యాల: కొండగట్టు అంజన్న సన్నిధిలో భక్తులు పోటేత్తారు. మంగళవారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. కోనేరులో స్నాన మాచరించి, స్వామివారికి మొక్కులు తీర్చుకున్నారు.  సోమవారం రాత్రి నుంచి ఉదయం వరకు భారీ వర్షం కురిసింది, ఈదురు గాలులకు ఆలయ ఆవరణలో చలువ పందిళ్ళు కూలిపోయాయి. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కూలిన చలవ పందిళ్ళు తొలగించక పోవడం, మిగిలిన పందిళ్ళు ఎక్కడ తమఫై పడుతాయో అని భక్తులు భయందోలనలకు గురి అయ్యారు.