ఈసీఐఎల్ డైరెక్టర్ (పర్సనల్) గా... అనురాగ్ మాల్వియా

ఈసీఐఎల్ డైరెక్టర్ (పర్సనల్) గా... అనురాగ్ మాల్వియా

ముద్ర , కుషాయిగూడ: ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) సంస్థ డైరెక్టర్ (పర్సనల్) గా... అనురాగ్ మాల్వియా నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం ఆయన ఈసీఐఎల్ సంస్థలో డైరెక్టర్ పర్సనల్ ఛాంబర్ లో బాధ్యతలను చేపట్టారు. కాగా ఈసీఐఎల్ సంస్థలో జనరల్ మేనేజర్ (హ్యూమన్ రిసోర్స్) గా బాధ్యతలు నిర్వహిస్తున్న అనురాగ్ మాల్వియాను... పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సెలక్షన్ బోర్డు (పి ఈ ఎస్ బి)  ఈసీఐఎల్ డైరెక్టర్ పర్సనల్గా ఎంపిక చేసింది. భూపాల్ యూనివర్సిటీలో ఎంబీఏ గోల్డ్ మెడల్, పీజీ డిప్లమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ పూర్తి చేశారు. ఐఐటీ ఢిల్లీలో... ఇండివిజల్ బిహేవియర్  ఆర్గనైజేషన్ లో ఆరు నెలల శిక్షణ కోర్సును పూర్తిచేసిన అనురాగ్ మాల్వియా హ్యూమన్ రిసార్ట్స్ లో 31 సంవత్సరాల విశేష అనుభవం ఉందని ఈసీఐఎల్ యాజమాన్యం ఓ ప్రకటనలో తెలిపింది. ఇక బాధ్యతలు చేపట్టిన అనురాగ్ మాల్వియా కు ఈసీఐఎల్ మజ్దూర్ సంఘ్ యూనియన్ ప్రధాన కార్యదర్శి నరసింగరావు, కమిటీ సభ్యులు కలిసి పుష్పగుచ్చాలతో అభినందనలు తెలిపారు.