రూ. 30 లక్షల నగదును స్వాధీనం చేసుకున్న కుషాయిగూడ పోలీసులు

రూ. 30 లక్షల నగదును స్వాధీనం చేసుకున్న కుషాయిగూడ పోలీసులు

ముద్ర , కుషాయిగూడ: వాహనాల తనిఖీల్లో... ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న రూ. 30 లక్షల నగదును కుషాయిగూడ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో కుషాయిగూడ పారిశ్రామికవాడ తల్లూరి థియేటర్ రోడ్డులో వాహనాల తనిఖీలు చేపట్టారు. అయితే కాప్రా అరుల్ నగర్ కాలనీ లో నివసిస్తున్న నల్ల సతీష్ కుమార్ (47) టీఎస్ 08 ఈ ఎల్  1102 నెంబర్ గల ద్విచక్ర వాహనంపై కుషాయిగూడ వైపు వస్తున్నాడు. దీంతో పోలీసులు ఆ వాహనాన్ని తనిఖీ చేయగా రూ. 30 లక్షల నగదు దొరికింది. ఈ నగదు సంబంధించిన ఎలాంటి పత్రాలను చూపించకపోవడంతో... పోలీసులు స్వాధీనం చేసుకొని ఆదాయ పన్ను శాఖ విభాగానికి అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.