నేటితో ముగియనున్న ఎన్నికల కోడ్...

నేటితో ముగియనున్న ఎన్నికల కోడ్...

ముద్ర,హైదరాబాద్:-  దేశంలో రెండున్నర మాసాలకు పైగా అమలులో ఉన్న ఎన్నికల కోడ్ నేటితో ముగుస్తుంది. సార్వత్రిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం మార్చి 16వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ మరుక్షణం నుంచే దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. ఆ తర్వాత ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదలైంది. ఇలా ఏడు విడతల్లో పోలింగ్ జరిగింది. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు జరిగి ఫలితాలు విడుదలయ్యాయి. ఈరోజు జూన్ 5వ తేదీ కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా కోడ్​ను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకోనుంది. ఇక కోడ్ ఎత్తివేసిన తర్వాత అన్ని రకాల ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించు కోవడానికి వీలవుతుంది.