పొన్నంకు మద్దతుగా గాంధీభవన్ 

పొన్నంకు మద్దతుగా గాంధీభవన్ 
  • గాంధీభవన్ కు తరలిన ఎల్లారెడ్డిపేట కాంగ్రెస్ నాయకులు

ముద్ర,ఎల్లారెడ్డిపేట :మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ కు మద్దతుగా ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆదివారం గాంధీభవన్ కు తరలి వెళ్లారు.ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య మాట్లాడుతూ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గౌడ్ కు అటు ఏఐసీసీలో ఇటు ఎన్నికల కమిటీలో పిఎసిలో స్థానం కల్పించక పోవడంపై పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేసేందుకు జిల్లా అధ్యక్షుడు ఆది శ్రీనివాస్ తో కలిసి వెళ్ళామన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు జిల్లా కార్యదర్శి లింగం గౌడ్, వంగ గిరిధర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, మండల బీసీ సెల్ అధ్యక్షులు అనవేని రవి, పట్టణ అధ్యక్షుడు చెన్ని బాబు,  మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బానోతు రాజు నాయక్  వెళ్లారు.