Big Breaking :- వాహనదారులకు గుడ్ న్యూస్..ట్రాఫిక్ చలాన్లు పొడిగింపు..!

Big Breaking :- వాహనదారులకు గుడ్ న్యూస్..ట్రాఫిక్ చలాన్లు పొడిగింపు..!

ముద్ర,తెలంగాణ:- తెలంగాణలో పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల పై రాయితీ చెల్లించే గడువును పొడిగిస్తూ రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 15 వరకు గడువు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.గతంలో విధించిన గడువు నేటితో ముగుస్తున్న తరుణంలో ఫిబ్రవరి 15 వరకు గడువు పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ 25 వరకు ఉన్న చలాన్ల పై మాత్రమే ఈ రాయితీ ఉంటుంది అని వెల్లడించింది.

మొదట గత ఏడాది డిసెంబర్ 27 వ తేదీ నుండి జనవరి 10 వ తేదీ వరకు రాయితీ చలాన్ల చెల్లింపులకు అవకాశం కల్పించారు.అయితే దీనిని ఆ తర్వాత జనవరి 31 వరకు పొడిగించారు.నేటితో గడువు ముగుస్తున్న తరుణంలో మరోసారి పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బైకులు, ఆటోలకు 80%, ఆర్టీసీ బస్సులకు 90%, లారీ వంటి భారీ వాహనాలకు 60% రాయితీని ప్రకటించారు.