బాధితులకు సత్వర న్యాయం గ్రీవెన్స్ డే లక్ష్యం

బాధితులకు సత్వర న్యాయం గ్రీవెన్స్ డే లక్ష్యం

 జిల్లా ఎస్పీ ఎగ్గడి భాస్కర్
ముద్ర ప్రతినిధి, జగిత్యాల: వివిధ సమస్యలతో పోలీసులను ఆశ్రయించే బాధితులకు సత్వర న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవడమే గ్రీవెన్స్ డే ముఖ్య లక్ష్యమని జిల్లా ఎస్పీ ఎగ్గడి భాస్కర్ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డే లో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన దాదాపు 29 మంది అర్జీదారులు రాగ ఎస్పి వారితో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు. 

గ్రీవెన్స్ డే లో వచ్చే ఫిర్యాదులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించడంతో పాటు పెండింగులో లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. భూ సమస్యల విషయంలో అన్ని కోణాలలో సమగ్రంగా విచారణ చేసి, క్షేత్ర స్థాయిలో పర్యటించి వాస్తవ పరిస్థితులను తెలుసుకొని అందుకు అనుగుణంగా బాధితులకు న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు.