ఐజేయూ, టీయూడబ్ల్యూజే సంతాపం ...
![ఐజేయూ, టీయూడబ్ల్యూజే సంతాపం ...](https://mudranews.in/uploads/images/2024/06/image_750x_6663d6649f21f.jpg)
రామోజీరావు మృతి పట్ల ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ ( ఐజేయూ), తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశాయి. తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్, ఐజేయూ అధ్యక్షుడు కే శ్రీనివాస్ రెడ్డి, ఐజేయూ సెక్రటరీ జనరల్ బల్విందర్ సింగ్ జమ్మూ, సెక్రటరీ వై నరేందర్ రెడ్డి, టీయూడబ్ల్యూజే అధ్యక్షుడు నగునూరి శేఖర్, కె విరాహత్ అలీ, ఐజేయూ కార్యవర్గ సభ్యులు కే సత్యనారాయణ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. మీడియా రంగంపై తనదైన ముద్ర వేసిన రామోజీరావు బహుముఖ ప్రజ్ఞాశాలి అని వారు ప్రశంసించారు.