మానేరు రివర్ ఫ్రంట్ తో టూరిస్ట్ హబ్ గా కరీంనగర్ 

మానేరు రివర్ ఫ్రంట్ తో టూరిస్ట్ హబ్ గా కరీంనగర్ 
  • కాళేశ్వరం ప్రాజెక్టుతో జలకళ
  • బ్లాక్ జోన్ లలో పెరిగిన భూగర్బజలాలు
  •  ప్రతి చెరువు కింద 100- 200 ఎకరాల సాగు: జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ అనంతరం సాగునీటి రంగంలో విప్లవాత్మకమైన మార్పులు జరిగాయని జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో బాగంగా సాగునీటి దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం జిల్లా కేంద్రంలోని వి కన్వేన్షన్ హల్ లో నిర్వహించిన  సాగునీటి దినోత్సవంలో జిల్లా కలెక్టర్ ముఖ్యఆతిధిగా పాల్గోన్నారు.  ఈ సందర్బంగా కలెక్టర్ మట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 10 ఏళ్లలో  విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయని, సాగునీటి రంగంలో ఎంతో అభివృద్ధి సాధించామని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో భూగర్భ జలాలు పెరిగాయని తెలిపారు. 410 కోట్లతో జిల్లాకు తలమాణికంగా నిర్మిస్తున్న మానేరు రివర్ ఫ్రంట్ ఇరువైపుల లోయర్ ప్రామినెడ్, అప్పర్ ప్రామినెడ్ లు, పార్కులు, ప్రపంచంలోనే అతిపెద్ద వాటర్ ఫౌంటెన్, థీమ్ పార్కులు, మ్యూజికల్ ఫౌంటెన్, ఆటస్థలాలు, గార్డేన్, స్పీడ్ బోట్లు మరియు క్రోజ్ బోట్లతో కరీంనకర్ జిల్లా టూరిస్ట్ హబ్ గా ఎదగనుందని అన్నారు.  తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావానికి ముందు, తరువాత తాను స్వయంగా చూసిన అనుభవాలను గురించి వివరించారు.

2009-10 లో మహరాష్ట్రా కు చెందిన సిరోంచ నుండి కాళేశ్వరానికి చేరుకోవాలంటే వర్షాకాలం మినహ అన్ని రోజులలో సిరోంచ వరకు జీప్ లో వెళ్లి అక్కడి నుండి బోట్ ద్వారా కాళేశ్వరం చేరుకోవాల్సి వచ్చేదని, ఇక సిరొంచ నుండి హైదరాబాద్ రావాలంటే సిరొంచ నుండి చంద్రాపూర్ మీదుగా ఆసిఫాబాద్ చేరుకుని అక్కడి నుండి హైదరాబాద్ చేరుకోవాల్సి వచ్చేదని,  ఈ ఒక్క ప్రయాణానికే దాదాపు 9 నుండి 10 గంటల సమయం పట్టేదన్నారు.  ప్రస్థుతం సిరొంచ నుండి కాళేశ్వరం మీదుగా హైదరాబాద్ కు కేవలం 4 గంటల్లో చేరుకుంటున్నామన్నారు.  ఈ మార్పు కేవలం 8 ఎళ్ల కాలంలోనే సంబవించిందన్నారు.   కాళేశ్వరం ప్రాజేక్టు నిర్మాణాన్ని చేపట్టడంతో వర్షాకాలం మినహ మిగిలిన అన్ని కాలాల్లో అడుగంటిపోయిన భూగర్బజాలాలతో బ్లాక్ జోన్ గా ప్రకటించిబడిన ప్రాంతాలు ఇప్పుడు 365 రోజులు 24 గంటల నీటి వసతితో ఉన్నాయన్నారు. పత్తి, మొక్కజోన్నను పండించే రైతులు కాళేశ్వరం ప్రాజేక్టు నిర్మాణంతో కూరగాయలను పండిస్తు అధికంగా లాభాలను ఆర్జిస్తున్నారని, గతంలో 4 లక్షలు పలికిన కాళేశ్వరం ప్రాజేక్టుతో అమాంతం పెరిగి 20 నుండి 25 లక్షలకు చేరిందన్నారు.  తెలంగాణ మాదిరి ఇరిగేషన్ ప్రాజెక్టులు మరే ఎక్కడా రాష్ట్రంలోను లేవన్నారు.  పదేళ్లలో ఇంతపెద్దస్థాయిలో ఇరిగేషన్ ప్రాజెక్టులను చేపట్టిన ఎకైక రాష్ట్రం ఒక్క తెలంగాణ మాత్రమేనని కొనియాడారు.  కాళేశ్వరం ప్రాజెక్టు కొరకు ల్యాండ్ అక్విటేషన్ పనులను కేవలం 6నెలల్లో పూర్తిచేసి ఇరిగేషన్ శాఖకు భూములను అందించం జరిగిందని. ఇదే మరో చోటైతే రెండు నుండి మూడు సంవత్సరాల కాలం పట్టేదన్నారు.  

 లిఫ్ట్ ఇరిగేషన్ పనులను గురించి తెలుపుతూ, ఖమ్మం జిల్లాలో తిరుమలపాలేం మండలంలో భూగర్బజలాలు దాదాపు 5వందల ఫీట్ల లోపలికి చేరుకొని డెడ్ స్టోరేజికి వెళ్లిపోయాయని, అక్కడ భక్తరామదాసు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును నిర్మించి కృష్ణానీటిని తీసుకురావడంతో,  భూగర్బజలాలు పెరిగిపోయాయని చెరువులు, కుంటలలో నీరు సమృద్దిగా లభించడంతో సాగు కూడా పెరిగిందన్నారు.  అదే విధంగా కరీంనగర్ జిల్లాలోని సైదాపూర్ మండలంలో కూడా భూగర్బజాలాలు అడుగంటిన పరిస్థితుల నుండి ఎల్.ఎం.డి. ప్రాజెక్టు ద్వారా ఆయకట్టులో మార్పులు చేపట్టడంతో అన్ని చెరువులు నిండు కుండలా మారిపోయాయన్నారు.  ఇదంతా ఒక్క కాళేశ్వరం ప్రాజేక్టు నిర్మాణంతో సాద్యమైదంటె అతిశయోక్తికాదన్నారు.  మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువుల పునరుద్దరణ చేపట్టడంతో ప్రతి చెరువు ద్వారా దాదాపు రెండువందల ఎకరాల్లో పంటను  రైతులు సాగుచేస్తున్నారన్నారు.  ఇతర రాష్ట్రాల్లో ఇరిగేషన్ వేటికవే పనులను నిర్వహిస్తాయని, పరిపాలన సౌలభ్యం కొరకు తెలంగాణలోని ఇరిగేషన్ శాఖలన్నింటిని ఒకే చోటుకు చేర్చడంతో  ఎ ఇరిగేషన్ పనైన సత్వరం పూర్తిచేసుకోవడం జరుగుతుందన్నారు. ఎల్ఎండి ద్వారా సూర్యపేట జిల్లాకు కూడా నీటిని అందించంతో అక్కడ పంటసాగు విపరీతంగా పెరిగిపోయిందని తెలిపారు.  

మేయర్ వై. సనీల్ రావు మాట్లాడుతూ, రాష్ట ఆవిర్బావానికి పూర్వం జిల్లాలో త్రాగునీటి కోసం యుద్దాలు చేసే పరీస్థితులు, మంచినీటి ట్యాంకర్ల కొసం పడిగాపులు గాచే దుస్థితి నెలకొని ఉండేదని , తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని  చేపట్టడంతో సాగు, త్రాగు నీటిని అందించుకోవడం మాత్రమే కాదు, ఓ స్థాయిలో డెడ్ స్టోరేజి కి చేరుకున్న ఎల్.ఎం.డి ఇప్పుడు నిండు కుండలా మారిందన్నారు.  నీటి, విద్యుత్   రంగాలను అభివృద్ది చేయంతో పారిశ్రామికంగా అభివృద్దిని సాదించుకోవడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా  ఉత్తమ ఇంజనీర్ గా రాష్ట్ర స్థాయి పురస్కారాన్ని అందుకున్న ఇరిగేషన్ శాఖ  ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నాగభూషణ్ ను కలెక్టర్ సత్కరించారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ జి.వి. రామకృష్ణారావు,  కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు, మార్కెట్ కమిటి చైర్మన్ రెడ్డవేణి మదు, పిఎసి చైర్మన్ సురేందర్ రెడ్డి, ఇరిగేషన్ ఎస్.ఈ. శివప్రసాద్, కరీంనగర్ ఆర్డిఓ ఆనంద్ కుమార్, వ్యవసాయశాఖ అధికారి శ్రీదర్,  కరీంనగర్ యంపిపి టి.  లక్ష్మయ్య,  కొత్తపల్లి యంపిపి  పిల్లి శ్రీలత,  జట్పిటిసిలు, యంపిటిసిలు, కార్పోరేటర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గోన్నారు.