ఏప్రిల్ మొదటివారంలో లోక్‌సభ ఎన్నికలు జరిగే చాన్స్ - కిషన్‌రెడ్డి

ఏప్రిల్ మొదటివారంలో లోక్‌సభ ఎన్నికలు జరిగే చాన్స్ -  కిషన్‌రెడ్డి

ముద్ర,తెలంగాణ:- ఏప్రిల్‌ మొదటివారంలో పార్లమెంట్‌ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని, ఫిబ్రవరి చివరి వారంలో కోడ్‌ మొదలవుతుందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు.లోక్‌సభ ఎన్నికలకు సమయం ఎక్కువగా లేదు. దాంతో.. అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికలకు సిద్ధం అవుతున్నాయి. ఇప్పటి వరకు అయితే లోక్‌సభ ఎన్నికలపై అధికారిక ప్రకటన లేకపోయినా.. ఏప్రిల్‌లో ఉండే అవకాశాలు ఉన్నాయని కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. ఏప్రిల్ మొదటి వారంలోనే ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. అయితే.. ముచ్చటగా మూడోసారి దేశంలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కాబోతుందని దీమా వ్యక్తం చేశారు. ఈసారి 350కి పైగా లోక్‌సభ స్థానాల్లో బీజేపీ విజయం సాధించబోతుంది కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి దీమా వ్యక్తం చేశారు.