లక్ష్మీ కుంటకు జలకళ

లక్ష్మీ కుంటకు జలకళ

 సందర్శించిన మంత్రి నిరంజన్ రెడ్డి
 ముద్ర ప్రతినిధి,  వనపర్తి : వనపర్తి మున్సిపాలిటీ శ్రీనివాసపురం గ్రామ పరిధిలోని లక్ష్మీ కుంటను ఎత్తిపోతల ద్వారా నీటిని నింపడంతో జలకలను సంతరించుకుంది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కుంటను సందర్శించి ఆనందాన్ని వ్యక్తం చేశారు. మంత్రి ప్రత్యేక చొరవతో ఈ కుంటాను ఎత్తిపోతల నీటి ద్వారా నింపారు. ఈ నీటి నిల్వతో భూగర్భ జలాలు పెరగడంతో పాటు పశుపక్షాదులకు నీరు లభిస్తుందని మంత్రి అన్నారు. ఈనెల ఆరవ తేదీన ఆత్మీయ సమ్మేళనం కోసం లక్ష్మీ కుంట వద్ద స్థలాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్,  మార్కెట్ కమిటీ చైర్మన్ రమేష్ గౌడ్, నాయకులు నరసింహ,  పరంజ్యోతి తదితరులు పాల్గొన్నారు.