ముదిరాజ్ ఉద్యోగుల సంఘం నాయకులను సన్మానించిన కొలుపుల...

ముదిరాజ్ ఉద్యోగుల సంఘం నాయకులను సన్మానించిన కొలుపుల...

ఆలేరు (ముద్ర న్యూస్):యాదాద్రి భువనగిరి జిల్లా ముదిరాజ్ ఎంప్లాయిస్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు గుర్రాల బాలకృష్ణ ముదిరాజ్. ప్రధాన కార్యదర్శి బండారి ప్రసాద్ ముదిరాజ్ లను సోమవారం నాడు ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షులు కొలుపుల హరినాథ్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలకృష్ణ. ప్రసాద్ లు తమ విధులను నిర్వహిస్తూ. ముదిరాజ్ కుల సభ్యులతోపాటు ఇతర వెనుకబడిన కుటుంబ సభ్యులకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తూ ప్రజలలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించారని చెప్పారు. ముదిరాజ్ సంఘం తో పాటు వీరు నిర్వహించే విధులలో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాశించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు చాడ నాగరాజ్ ముదిరాజ్. ఉపాధ్యక్షులు గుర్రాల బాలరాజ్ ముదిరాజ్. జిల్లా మత్స్యశాఖ డైరెక్టర్ శంకర్ ముదిరాజ్ తో పాటు ముదిరాజ్ సంఘం సభ్యులు. తదితరులు పాల్గొన్నారు.