యాదవుల అభివృద్ధికి కృషి చేద్దాం
![యాదవుల అభివృద్ధికి కృషి చేద్దాం](https://mudranews.in/uploads/images/2023/04/image_750x_6432bf6214477.jpg)
చిగురుమామిడి ముద్ర న్యూస్: యాదవులు అభివృద్ధి చెందాలంటే యాదవ జాతి సంఘటితం కావాలని యాదవ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు బండి మల్లయ్య యాదవులకు పిలుపునిచ్చారు. చిగురుమామిడి మండలంలో యాదవ హక్కుల పోరాట సమితి నూతన మండల కమిటీ ఏర్పాటు సమావేశంలో పై విధంగా ఆయన అన్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు బండి మల్లయ్య యాదవ్, జిల్లా కార్యదర్శి గంగుల లింగం కుమార్ యాదవ్ హాజరై మండల నూతన కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... దేశంలోనే యాదవ జనాభా అత్యధికంగా ఉన్నప్పటికీ యాదవులు ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడి ఉన్నామని అన్నారు. యాదవులు అభివృద్ధి చెందడానికి, యాదవ హక్కుల కోసం యాదవ హక్కుల పోరాట సమితి కృషి చేస్తుందని పేర్కొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన మండల కమిటీకి వారు శుభాకాంక్షలు తెలిపారు.
మండల నూతన కమిటీ ఎన్నిక...చిగురుమామిడి మండల అధ్యక్షుడుగా లంబాడిపల్లె గ్రామానికి చెందిన చెందబోయిన పరశురామ్ యాదవ్ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా పోతరవేణి నర్సయ్య యాదవ్, చందబోయిన మల్లయ్య యాదవ్, కుమారస్వామి యాదవ్, ప్రధాన కార్యదర్శిగా గాగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ముక్కెర మోహన్ యాదవ్, సహాయ కార్యదర్శిగా గౌడ బిక్షపతి యాదవ్, మర్రి సతీష్ యాదవ్, గౌరవ అధ్యక్షునిగా మొగిలి బోందయ్య యాదవులను ఎన్నుకున్నారు. మండల కమిటీ ఎన్నికకు సహకరించిన వారందరికీ, జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులకు వారు కృతజ్ఞతలు తెలిపారు.