మైనార్టీలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం

మైనార్టీలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం
  • ముస్లిం మైనార్టీలకు ప్రత్యేక పథకాలు తెస్తాం
  • ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి

హుజూర్ నగర్ టౌన్ ముద్ర:మైనార్టీలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని, ముస్లిం మైనార్టీలకు ప్రత్యేక పథకాలను తెస్తామని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజవర్గ వ్యాప్తంగా మైనార్టీలకు మంజూరైన లక్ష రూపాయల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మైనార్టీల జీవితాల్లో వెలుగులు నింపే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేస్తున్నారని, ముస్లింల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా ఇంగ్లీష్ మీడియం విద్యను మైనార్టీ గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేయించి నాణ్యమైన విద్యను అందిస్తున్నారనారు. మసీదుల్లో మౌజములకు వేతనం ఇచ్చి వారి జీవితాల్లో వెలుగులు నింపారని అన్నారు. రంజాన్ పండుగ సమయంలో ముస్లింలకు కొత్త బట్టలు, ఇఫ్తార్ విందు లు ఏర్పాటు చేసి మైనార్టీ బంద్ ప్రకటించి, వారికి జీవనోపాధి కల్పిస్తున్న ఏకైక ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వమని, ముస్లిం మైనార్టీలకు తాను అండగ ఉంటానన్నారు. కార్యక్రమంలో జడ్పిటిసి కొప్పుల సైదిరెడ్డి, ఎంపీపీ మూడవత్ పార్వతి కొండ నాయక్, బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు చిట్యాల అమర్నాథ్ రెడ్డి , మాజీమున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్, కౌన్సిలర్ అట్లూరి హరిబాబు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.