బునాదిగాని కాలువను ఎప్పటిలోపు పూర్తి చెస్తారో ఎమ్మెల్యే ప్రకటించాలి
![బునాదిగాని కాలువను ఎప్పటిలోపు పూర్తి చెస్తారో ఎమ్మెల్యే ప్రకటించాలి](https://mudranews.in/uploads/images/2023/02/image_750x_63f0fe9d3edb8.jpg)
యండి జహంగీర్ సిపిఎం జిల్లా కార్యదర్శి
ఆత్మకూరు (ఎం) ఫిబ్రవరి 18 (ముద్ర న్యూస్) బునాదిగాని కాలువ పనులను ఎప్పటిలోపు పూర్తి చెస్తారో స్థానిక ఎమ్మెల్యే గొంగిడి సునితమహెందర్ రెడ్డి తక్షణమే స్పష్టమైన ప్రకటన చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి యండి జహంగీర్ డిమాండ్ చేశారు. శనివారం రోజున సిపిఎం జిల్లా నాయకత్వం ఆత్మకూరు మండల శివారులో బునాదిగాని కాలువ ను పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి యండి జహంగీర్ మాట్లాడుతూ జిల్లాలో 98 కిలోమీటర్ల మేర ఉన్న బునాదిగాని కాలువ బీబీనగర్, భువనగిరి, వలిగొండ, మోటకొండూరు, ఆత్మకూరు, మోత్కూర్, అడ్డగూడురు మండలాల్లో ప్రవహిస్తోందని మూసి నీటికి బదులుగా గోదావరి నీటిని బస్వాపురం రిజర్వాయర్ నుండి తిసుకు వచ్చి పహిల్మాన్ పురం చెరువు ని మీని రిజార్వాయర్ చేసి బునాదిగాని కాలువకు అనుసందానం చేసి రైతాంగానికి నీరందించాలని డిమాండ్ చేశారు.
ఈ కాలువ పనులు ఎప్పటిలోపు పూర్తి చేస్తారో ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.లెని యెడల సిపిఎం ఆధ్వర్యంలో పాదయాత్ర చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సిపిఎం సినీయర్ నాయకులు గుడూరు అంజిరెడ్డి, సంగు నరేందర్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరి బాలరాజు గౌడ్, కల్లూరి మల్లేశం, జిల్లా కమిటి సభ్యులు గడ్డం వెంకటేశం, మండల కార్యదర్శి వేముల బిక్షం,నాయకులు రచ్చ గోవర్థన్, సత్తయ్య, సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.