ఎల్.చంద్రశేఖర్ ను పరామర్శించిన ఎంపీ అర్వింద్.

ఎల్.చంద్రశేఖర్ ను పరామర్శించిన ఎంపీ అర్వింద్.

ముద్ర ప్రతినిధి, జగిత్యాల:బీజేపీ సీనియర్ నాయకులు ఎల్.చంద్రశేఖర్ తండ్రి ఎల్.జి.రామ్ ఇటీవల మృతి చెందగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సోమవారం ఎల్.చంద్రశేఖర్ కుటుంబ సభ్యులను పరామర్శించారు.ఈ సందర్భంగా ఎల్.జి రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఎం.పి అర్వింద్ ఎల్.జి. రామ్ జీవిత విశేషాలను అడిగి తెలుసుకున్నారు.బలహీన వర్గానికి చెందిన ఎల్.జి రామ్ తన స్వశక్తితో ఎదిగి జగిత్యాల ప్రాంతం లో తిరుగులేని వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించి నేటి యువతకు ఆదర్శంగా నిలిచాడన్నారు. ఈ సందర్భంగా ఎంపీ వెంట బిజెపి జిల్లా అధ్యక్షుడు పైడిపల్లి సత్యనారాయణ రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బోగ శ్రావణి ప్రవీణ్, నియోజకవర్గ ఇన్చార్జ్ మదన్మోహన్, నాయకులు  పన్నాల తిరుపతిరెడ్డి, పడాల తిరుపతి, వీరబత్తిని అనిల్, జగదీష్, పవన్ సింగ్ తదితరులున్నారు.