తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా మల్లు రవి..

తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా మల్లు రవి..

ముద్ర,తెలంగాణ:- దిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా మల్లు రవి బాధ్యతలు చేపట్టారు. ఈ మేరకు డప్పు వాయిద్యాలతో తెలంగాణ భవన్‌లో ఆయనకు ఘన స్వాగతం పలికారు. దిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ పనులు, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయకర్తగా మల్లు రవి వ్యవహరించనున్నారు. కాగా, తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఇటీవల మల్లు రవిని సీఎం రేవంత్‌ నియమించిన విషయం తెలిసిందే.