తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా మల్లు రవి..
![తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా మల్లు రవి..](https://mudranews.in/uploads/images/2024/01/image_750x_65b6499b0d5a5.jpg)
ముద్ర,తెలంగాణ:- దిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా మల్లు రవి బాధ్యతలు చేపట్టారు. ఈ మేరకు డప్పు వాయిద్యాలతో తెలంగాణ భవన్లో ఆయనకు ఘన స్వాగతం పలికారు. దిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ పనులు, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయకర్తగా మల్లు రవి వ్యవహరించనున్నారు. కాగా, తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఇటీవల మల్లు రవిని సీఎం రేవంత్ నియమించిన విషయం తెలిసిందే.