'ముద్ర' ప్రత్యేక సంచిక ఆవిష్కరణ

'ముద్ర' ప్రత్యేక సంచిక ఆవిష్కరణ

ముద్ర న్యూస్ బ్యూరో, హైదరాబాద్: నగరంలో జరుగుతున్న బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా 31వ కన్వెన్షన్ సందర్భంగా ముద్ర దినపత్రిక ప్రచురించిన ప్రత్యేక సంచికను అసోసియేషన్ నాయకులు ఆవిష్కరించారు. వివిధ రాష్ట్రాల నుంచి సదస్సుకు హాజరైన అసోసియేషన్ ప్రతినిధుల కరతాళ ధ్వనుల మధ్య ఈ ప్రత్యేక సంచిక ఆవిష్కరణ జరిగింది.

1941 లో బిల్డర్స్ అసోసియేషన్ ఆవిష్కరణ, అది నిర్వహించిన కార్యక్రమాలు, భవన నిర్మాణ కార్మికుల నైపుణ్యాన్ని పెంచడానికి నిర్వహిస్తున్న శిక్షణా కార్యక్రమాలు, వారి సంక్షేమం కోసం చేపడుతున్న చర్యలు, అసోసియేషన్ సభ్యుల సమస్యలను పరిష్కరించడంలో చూపుతున్న చొరవ గురించి ప్రత్యేక సంచికలో వివరంగా ప్రచురించారు.

దేశంలో మౌలిక సదుపాయాల కల్పన కోసం బిల్డర్లు చేస్తున్న కృషి గురించి కూడా అందులో వివరించారు. ఈ కార్యక్రమంలో బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు ఎస్.ఎన్.రెడ్డి, అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కే దేవేందర్ రెడ్డి, కన్వెన్షన్ చైర్మన్ ఆర్ రాధాకృష్ణన్, ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ బొల్లినేని శ్రీనయ్య, కన్వెన్షన్ కమిటీ వైస్ చైర్మన్ వి సుగుణాకర రావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎన్ సచ్చిదానంద్ రెడ్డి, కన్వెన్షన్ కమిటీ సెక్రటరీ డివిఎన్ రెడ్డి, భూపేందర్ సింగ్, ఫైనాన్స్ కమిటీ చైర్మన్ సంకినేని కృష్ణారావు, ముద్ర మేనేజింగ్ డైరెక్టర్ కే. సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.