సుడాన్​లో విమాన ప్రమాదం

సుడాన్​లో విమాన ప్రమాదం
  • 9 మంది మృతి
  • విద్రోహమా? సాంకేతిక లోపమా?
  • విచారిస్తున్నామన్న ఆర్మీ అధికారులు

సుడాన్​: సుడాన్​లో ఆర్మీ పౌర సేవలకు వినియోగించే విమానం కూలిపోయి 9మంది మృతిచెందారు. పలువురికి గాయాలయ్యాయి. సూడాన్‌లో గత 3 నెలలుగా ఆర్మీ, పారామిలిటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ మధ్య యుద్ధం జరుగుతోంది. దీంతో సూడాన్‌లో అంతర్యుద్ధం కొనసాగుతోంది. కాగా సూడాన్‌లోని పోర్ట్ సుడాన్ విమానాశ్రయంలో విమానం కూలిపోవడం విద్రోహ చర్య అనే అనుమానాలు కూడా ఆర్మీ వ్యక్తం చేస్తుంది. పారామిలిటరీ ఫోర్స్​విమాన ప్రమాదానికి కారణమనే ఆరోపణలు చేస్తోంది.  ఈ విమానంలో ఆర్మీకి చెందిన నలుగురు ఉండగా, మిగతా వారు సామాన్య పౌరులుగా ఆర్మీ అధికారులు వెల్లడించారు. ఘటనలో ఓ బాలిక ప్రాణాన్ని సహాయక బృందాలు కాపాడి ఆసుపత్రికి తరలించాయి.  కాగా ప్రమాదానికి సాంకేతిక లోపమే కారణం అనే వాదనలూ ఉన్నాయి. దీనిపై కూడా విచారణ చేపడుతున్నట్లు ఆర్మీ వెల్లడించింది.