గృహ వినియోగదారులకు తీపి కబురు
![గృహ వినియోగదారులకు తీపి కబురు](https://mudranews.in/uploads/images/2023/03/image_750x_63ff8311bf1d1.jpg)
- ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ నుండి స్వచ్ఛమైన గానుగనూనె
- కల్తీ ఉండదు...కెమికల్ ను కలుపరు
- మంత్రి జగదీష్ రెడ్డి చేతుల మీదుగా విడుదల
- పాల్గొన్న ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ కంచర్ల రామకృష్ణ రెడ్డి
హైదరాబాద్ ముద్ర న్యూస్ : తెలంగాణా ఆయిల్ ఫెడ్ నుండి వంటకు సంబంధించిన స్వచ్చమైన గానుగనూనె ను అందుబాటులోకి తెచ్చారు.ఎటువంటి కల్టీకి ఆస్కారం లేకుండా తయారు చెయ్యడంతో పాటు కెమికల్స్ కలుపకుండా ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో ఈ గానుగనూనె తయారు అవుతుంది. ఈ మేరకు బుధవారం ఉదయం హైదరాబాద్ లోని మంత్రుల నివాస ప్రాంగణంలో రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి చేతుల మీదుగా ఈ మార్క్ ఫెడ్ గానుగనూనే అధికారికంగా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.