మెదక్ డీఈఓగా రాధా కిషన్

మెదక్ డీఈఓగా రాధా కిషన్
Radha Kishan as the DEO of Medak

మెదక్ డిఈఓ రమేష్ సిరిసిల్లకు బదిలీ
ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ జిల్లా నూతన విద్యాధికారిగా రాజన్న సిరిసిల్ల డిఇఓ డి. రాధా కిషన్ బదిలీపై రానున్నారు. మెదక్ జిల్లా విద్యాధికారిగా పనిచేసిన ఏ. రమేష్ కుమార్ రాజన్న సిరిసిల్లకు బదిలీ అయ్యారు. ఈమేరకు విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేన  ఉత్తర్వులు జారీ చేశారు. మెదక్ జిల్లా విద్యాధికారిగా పనిచేసిన రమేష్ కుమార్ 2019 అక్టోబర్లో ఇక్కడికి పూర్తి బాధ్యలతో రావడం జరిగింది. డి. రాద్దాకిషన్ ఎస్సీఈఆర్టీ ప్రొఫెసర్ గా పని చేస్తూ రాజన్న సిరిసిల్ల బాధ్యతలు నిర్వహిస్తు, మెదక్ జిల్లాకు బదిలీయ్యారు.