మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై హై కోర్టుకు నివేదిక
![మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై హై కోర్టుకు నివేదిక](https://mudranews.in/uploads/images/2023/10/image_750x_651faac436d2d.jpg)
- సోమవారం తుది తీర్పు.. సర్వత్రా ఉత్కంఠ
ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర మంత్రి శ్రీనివాస్గౌడ్ఎన్నికల అఫడవిట్ట్యాంపరింగ్కేసు కీలక దశకు చేరుకున్నది. ఇప్పటికే మంత్రిపై కేసుకు ఆదేశాలిచ్చిన విషయం తెలిసిందే. మంత్రితో సహా 11 మంది అధికారులపైనా మహబూబ్నగర్ పీఎస్లో కేసు నమోదైంది. అయితే దీనిపై వాదనల సందర్భంగా పూర్తి వివరాల కోసం హైకోర్టు.. అడ్వకేట్కమిషన్ను నియమించింది. ఈ కమిషన్ఇటీవల మంత్రి శ్రీనివాస్గౌడ్తోపాటుగా ఆయన సతీమణిని విచారణ చేసింది. ఎన్నికల్లో సమర్పించిన అఫడవిట్పై ప్రశ్నించింది. ఈ నేపథ్యంలోనే అడ్వకేట్కమిషన్.. తమ పూర్తి నివేదికను హైకోర్టుకు గురువారం సమర్పించింది. దీనిపై గురువారం విచారణ చేపట్టారు. ఇరువర్గాల న్యాయవాదులు వాదనలు వినిపించారు. వాదనలు విన్న తర్వాత.. సోమవారం తుది తీర్పు వెల్లడించనున్నట్లు ప్రకటించారు.
కాగా మంత్రి శ్రీనివాస్గౌడ్అఫిడవిట్ట్యాంపరింగ్కేసుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది. ఇప్పటికే ఈ విషయంలో అధికారుల తీరును తప్పు పట్టారు. ఈ నేపథ్యంలోనే సోమవారం ఎలాంటి తీర్పు వస్తుందనే ఆసక్తి నెలకొన్నది. ఇటీవల అడ్వకేట్కమిషన్ముందు విచారణ సందర్భంగా కూడా మంత్రి శ్రీనివాస్గౌడ్ కొన్ని ప్రశ్నలకు సమాధానాలు దాట వేసినట్లు తెలిసింది. పింఛన్జమ అయ్యే ఖాతా విషయంలో ఏటీఎం కార్డు తన డ్రైవర్ దగ్గర ఉంటుందని, మంత్రి భార్య బ్యాంకు ఖాతా, లాకర్ విషయం తనకు తెలియదంటూ దాట వేసినట్లుగా న్యాయవాదులు వెల్లడించారు. వీటన్నింటిపైనా అడ్వకేట్ కమిషన్నివేదిక ఇచ్చింది. దీంతో సోమవారం తీర్పుపై ఉత్కంఠ నెలకొన్నది.