పోలింగ్ సరళి పరిశీలించిన ఎస్పీ రాహుల్ హెగ్డే

పోలింగ్ సరళి పరిశీలించిన ఎస్పీ రాహుల్ హెగ్డే

ముద్ర ప్రతినిధి సూర్యాపేట: గురువారం సూర్యాపేట జిల్లాలో ప్రారంభమైన ఎన్నికల ప్రక్రియ సరళని బందోబస్తు వివరాలను సూర్యాపేట జిల్లా ఎస్పీ రాహుల్ రెడ్డి పరిశీలించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో అంబేడ్కర్ నగర్, చిoతలచెరువు, రాజీవ్ నగర్, బర్లపెంటబజారు లలో పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు, పోలింగ్ సరళి నీ పరిశీలించడం జరిగినది.  ఎస్పీ వెంట డి.ఎస్.పి పరిక  నాగభూషణం, పట్టణ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ ఉన్నారు.

అనంతరం జిల్లా పోలింగ్ సరళి, పోలీస్ బందోబస్తును ఎస్పీ పరిశీలించారు సిబ్బందికి తగు సూచనలు ఆదేశాలు జారీ చేశారు శాంతిభద్రతలకు భంగం కలగకుండా అన్ని రకాల కట్టుదిట్టమైన చర్యలు ఆయా ప్రాంతాల్లో బందోబస్తులో ఉన్నవారు తీసుకోవాలని ఆదేశించారు. కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుండి సీసీటీవీ కెమెరాల ద్వారా జిల్లాలో పోలింగ్ బూత్ ల వద్ద ఎన్నికల ప్రక్రియ, పోలీసు బందోబస్తు, భద్రత ను పర్యవేక్షణ చేసిన ఎస్పీ రాహుల్ హెగ్డే  పర్యవేక్షించారు.