విద్యార్థినులను వేధిస్తున్న ప్రిన్సిపల్..

విద్యార్థినులను వేధిస్తున్న ప్రిన్సిపల్..
  •  ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఎదుట విద్యార్థినుల ధర్నా

ముద్ర,తెలంగాణ:-కొత్తగూడెం మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మణరావు తమను వేధిస్తున్నారని, అర్ధ రాత్రి వసతి గృహాలకు వెళ్లి అసభ్యకరంగా మాట్లాడుతున్నారని సోమవారం సుమారు 300 మంది మెడికల్ విద్యార్థినులు నిరసన వ్యక్తం చేశారు. హాస్టల్లో సరైన తాగునీటి వసతి లేదని, బయట నుంచి ఎక్కువ ధరకు ప్యూరిఫైడ్ నీరు తెచ్చుకుని తాగుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఫుడ్ మెనూ అమలులో నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని ఆందోళన చేపట్టారు.