జాతీయస్థాయి త్రో బాల్ పోటీలకు రామన్నపేట విద్యార్థులు

జాతీయస్థాయి త్రో బాల్ పోటీలకు రామన్నపేట విద్యార్థులు

ముద్ర, మల్యాల: మల్యాల మండలం రామన్నపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు జాతీయ స్థాయి త్రో బాల్ పోటీలకు ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయులు రాజ గోవిందరెడ్డి తెలిపారు. గడ్డం సాయిచరణ్, కొండబత్తిని ఆదిత్యలు పోటీలకు ఎంపికయ్యారని ఆయన పేర్కొన్నారు. ఈనెల 5వ తేదీన హైదరాబాదులో తెలంగాణ త్రో బాల్ అసోసియేషన్ వారు నిర్వహించిన రాష్ట్రస్థాయి త్రో బాల్ పోటీలలో మంచి ప్రతిభ కనబరిచి, ఈనెల 28 నుంచి 30 తేదీలలో చత్తీస్గడ్ రాష్ట్రంలోని బిలాస్పూర్ లో నిర్వహించే జాతీయస్థాయి పోటీలకు ఎంపికయినట్లు వివరించారు. వీరిని పాఠశాల ఉపాధ్యాయ బృందం,  సర్పంచ్ గడ్డం జలజ మల్లారెడ్డి, పాఠశాల ఎస్ఎంసి చైర్మన్ రవీందర్, గ్రామ ఎంపీటీసీ సఫియా బేగం, ఉపసర్పంచి తిరుపతిరెడ్డి, కో ఆప్షన్ మెంబర్ అజారుద్దీన్, తదితరులు అభినందించారు.