ఇంటర్ ఫలితాల్లో ప్రతిభ ప్రభంజనం
![ఇంటర్ ఫలితాల్లో ప్రతిభ ప్రభంజనం](https://mudranews.in/uploads/images/2023/05/image_750x_645a5b469c451.jpg)
ముద్ర ప్రతినిధి, సూర్యాపేట ఇంటర్ ఫలితాలు ప్రతిభా ప్రభంజనం సృష్టించినట్లు కరస్పాండెంట్ కే.వెంకట్ రెడ్డి ప్రిన్సిపాల్ కే సత్యంబాబు లు తెలిపారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో జి జయ శ్రీ జి శ్రీనివాస్ 1000 మార్కుల గాను 989 మార్కులు సాధించి టౌన్ ఫస్ట్ గా నిలిచినట్లు తెలిపారు బైపీసీ విభాగంలో 1000 మార్కుల గాను 985 మార్కులు సాధించి ఎం మానస రాజ్ టౌన్ ఫస్ట్ ర్యాంకు సాధించినట్లు తెలిపారు 900 మార్కులకు పైగా 89 మంది విద్యార్థులు మార్కులు సాధించారని తెలిపారు.
జూనియర్ ఇంటర్ బైపిసి విభాగంలో 440 మార్కుల గాను ఏ లతాన్సీ 434 మార్కులు, ఎండి రొకియా యూనిసా వేగం 440 మార్కులకు గాను 430 మార్కులు సాధించినట్లు వీరితోపాటు నాలుగు వందల మార్కులకు పైగా 81 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించి జిల్లా ఫస్ట్ ర్యాంకులో నిలిచినట్లు తెలిపారు. ఇట్టి విజయం కు సహకరించిన విద్యార్థులకు అధ్యాపక సిబ్బందికి తల్లిదండ్రులకు అభినందనలు తెలిపారు.