నేతాజీనగర్ లో సుభాష్ కు నివాళి
![నేతాజీనగర్ లో సుభాష్ కు నివాళి](https://mudranews.in/uploads/images/2023/01/image_750x_63ceaf22d5ead.jpg)
హైదరాబాద్, ముద్ర ప్రతినిధి: దేశానికి స్వాతంత్ర్యం సాధించేందుకు నిరంతరం పోరాడుతూ ప్రాణ త్యాగం చేసిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా మెహదీపట్నం సమీపంలోని నేతాజీ నగర్ కాలనీలో రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కాలనీ ప్రముఖులు మాట్లాడుతూ సాయుధ పోరాటం ద్వారా స్వాతంత్ర్యం సాధించాలని సంకల్పించిన సుభాష్ చంద్రబోస్ ప్రవాస ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి బ్రిటిష్ సైన్యంతో పోరాటం చేశారని చెప్పారు. బర్మా, జపాన్, జర్మనీ లాంటి అనేక దేశాలలో రహస్యంగా పర్యటించి ఆజాద్ హింద్ పౌజ్ కు మద్దతు సమకూర్చుకున్నారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జి అప్పారావు, ఉపాధ్యక్షులు అంజి రెడ్డి, ఖాలిద్ సర్వర్, మాజీ అధ్యక్షుడు టి ఎస్ ఆనంద్, మాజీ కార్యదర్శి ఫకృద్దీన్, కృష్ణమూర్తి, గంగాధరన్, పి. శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.