కొత్త ఎమ్మెల్సీలకు  సీఎం అభినందనలు

కొత్త ఎమ్మెల్సీలకు  సీఎం అభినందనలు
కొత్త ఎమ్మెల్సీలకు  సీఎం అభినందనలు
కొత్త ఎమ్మెల్సీలకు  సీఎం అభినందనలు

హైదరాబాద్: ఎమ్మెల్యే కోటా ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా ఎమ్మెల్సీలు కుర్మయ్యగారి నవీన్ కుమార్, దేశపతి శ్రీనివాస్, చల్లా వెంకట్రామిరెడ్డి గురువారం నాడు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. తమకు అవకాశం కల్పించినందుకు వారు మరోసారి ముఖ్యమంత్రి కి కృతజ్జతలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వారిని ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపారు.