విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన బండి
![విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన బండి](https://mudranews.in/uploads/images/2023/04/image_750x_644699399b292.jpg)
ముద్ర ప్రతినిధి కరీంనగర్ : ‘‘ఖేలో కరీంనగర్ – జీతో కరీంనగర్’’ పేరుతో ఇటీవల కరీంనగర్ పార్లమెంట్ క్రీడోత్సవాల్లో గెలిచిన క్రీడాకారులకు కరీంనగర్ లోని అంబేద్కర్ స్టేడియంలో బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. పార్లమెంట్ పరిధిలోని కరీంనగర్, చొప్పదండి, మానకొండూరు, హుజూరాబాద్, హుస్నాబాద్, సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల నుండి యువతీ యువకులు పాల్గొన్న పాల్గొన్న ఈ కార్యక్రమంలో బీజేపీ కరీంనగర్, సిరిసిల్ల, హన్మకొండ జిల్లాల అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి, ప్రతాప రామక్రిష్ణ, రావు పద్మ, సిరిసిల్ల జిల్లా ఇంఛార్జ్ మోహన్ రెడ్డి, హుస్నాబాద్ నేత బొమ్మ శ్రీరాం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, అథ్లెటిక్స్ రన్నింగ్, షార్ట్ పుట్, లాంగ్ జంప్ ఆటల్లో గెలుపొందిన విజేతలందరికీ బండి సంజయ్ స్వయంగా బహుమతులు అందజేశారు.