రైతులను ఆదుకోవాలి... తడిసిన ధాన్యం కొనాలి అదనపు కలెక్టర్ కు బిజెపి వినతిపత్రం

రైతులను ఆదుకోవాలి... తడిసిన ధాన్యం కొనాలి అదనపు కలెక్టర్ కు బిజెపి వినతిపత్రం

ముద్ర ప్రతినిధి, మెదక్: గత కొన్ని రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులను వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని, తడిసిన ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలని మెదక్ జిల్లా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో శుక్రవారం భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ అదనపు కలెక్టర్ రమేష్ కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు జనగామ మల్లారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నందు జనార్దన్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ ఎక్కల దేవి మధు, జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లాల విజయ్ కుమార్,  పట్టణ అధ్యక్షులు నాయిని ప్రసాద్, జిల్లా కార్యవర్గ సభ్యులు కల్కి నాగరాజు, నందారెడ్డి, బండ్ల సత్యనారాయణ, ఎంఎల్ఎన్ రెడ్డి, నిజాంపేట మండల అధ్యక్షుడు చంద్రశేఖర్, చిన్నశంకరంపేట మండల అధ్యక్షులు రాజు, మెదక్ మండల అధ్యక్షులు ప్రభాకర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శివ,  జిల్లా నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.