ఎండలో పిల్లలు..చెట్ల నీడన నేతలు

ఎండలో పిల్లలు..చెట్ల నీడన నేతలు

చిగురుమామిడి ముద్ర న్యూస్: చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామంలో జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించారు. అయితే బడి పిల్లలను ర్యాలీకి తీసుకువచ్చారు. ఉదయం ర్యాలీ తీయాల్సి ఉండగా 11 గంటలకు ర్యాలీ తీయడంతో పిల్లలు ఎండ వేడిమి భరించలేకపోయారు. అసలే వడగాల్పులు రావడం... ఉక్కపోత వలన  విద్యార్థులు అసౌకర్యానికి గురైయ్యారు. మరోవైపు నాయకులు మాత్రం చెట్ల నీడన సేద తీరడం కనిపించారు. ఇది విమర్శలకు తావిచ్చింది. ఎండలో నడుస్తున్న పిల్లలను చూసి తల్లిదండ్రులు ఆవేదన చెందారు. పిల్లలను ఎండలో నడిపించడంపై నాయకులను నిలదీశారు. తెల్లవారితే పరీక్షలు ఉండగా పిల్లలను ర్యాలీకి ఎందుకు తీసుకువచ్చారని ప్రశ్నించారు.