మృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళ ప్రధాన కార్యదర్శి

మృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళ ప్రధాన కార్యదర్శి

నడిగూడెం, అక్టోబర్ 12: మండలం లోని రత్నవరం గ్రామానికి చెందిన మొలుగూరి లక్ష్మి కొద్ది రోజుల క్రితం అనారోగ్యం తో బాధ పడుతూ  మృతి చెందడం తో గురువారం లక్ష్మి దశ దిన కర్మ కార్యక్రమం కు  కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళ కార్యదర్శి కన్నెబోయిన ఉదయశ్రీ రఘువీర్ 50 కేజీ ల బియ్యం సహాయం చేశారు.అనంతరం లక్ష్మి చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఉదయశ్రీ రఘువీర్ మాట్లాడుతూ పేద వారి కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని, తెలిపారు.మృతురాలి కుటుంబానికి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమం లో సర్పంచ్ పగడాల పద్మాప్రభాకర్ రెడ్డి,పసుపులేటి వినయ్ వర్ధన్, జొన్నలగడ్డ వీర గోవిందు, వి. యల్. యన్ గౌడ్, మొలుగూరి నరసింహారావు, కలకొండ గోవిందు, గురవయ్య, చెన్నయ్య, నరసయ్య తదితరులు పాల్గొన్నారు.