వినాయకుడి సేవలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి

వినాయకుడి సేవలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి

ముద్ర ప్రతినిధి: వినాయక నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మెదక్ జిల్లా ప్రధాని న్యాయమూర్తి లక్ష్మిశారద పట్టణంలోని పంచముఖి గణేష్ మండలి వద్ద వినాయకుడికి  ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంటప నిర్వాహకులు బూర్ల సచిన్ స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం నిర్వాహకులు శాలువాతో సత్కరించారు.  యువ న్యాయవాది ప్రశాంత్ తదితరులున్నారు.