తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం

తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం

రానున్న ఎన్నికల్లో కేసీఆర్ ను గద్దె దింపుతాం

తుంగతుర్తి ముద్ర: తెలంగాణ దశాబ్ది ఉత్సవాల  పేరుతో  బిఆర్ఎస్ ప్రభుత్వం కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని      దుర్వినియోగం చేస్తుందని, సొంత పార్టీ ప్రచారానికి ఉపయోగించుకుంటుందని ,కాంగ్రెస్ పార్టీ నాయకులు నియోజకవర్గ ఇన్చార్జ్ గుడిపాటి నరసయ్య, రాష్ట్ర అధికార ప్రతి నిధి అనపర్తి జ్ఞానసుందర్లు అన్నారు. గురువారం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపుమేరకు కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన అనంతరం వారు మాట్లాడారు. రాష్ట్రంలో నియంత పాలన సాగుతుందని ,రానున్న ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని అన్నారు. అనంతరం, తుంగతుర్తి మెయిన్ రోడ్డుపై రాలి నిర్వహించి, స్థానిక ఎమ్మార్వో కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో  పీసీసీ ప్రధాన కార్యదర్శి బాలలక్ష్మి, జిల్లా కాంగ్రెస్ నాయకులు తిరుమల ప్రగడ కిషన్ రావు, మండల పార్టీ అధ్యక్షుడు దొంగరి గోవర్ధన్ ,కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగం సుధాకర్ రెడ్డి, సత్యం, మండల ఉపాధ్యక్షులు మారగాని వెంకటయ్య, పెద్ద బోయిన అజయ్ ,ఎన్ ఎస్ యు ఐ ఇంచార్జ్ కొండరాజు, కాంగ్రెస్ నాయకులు ప్రవీణ్ రెడ్డి, రాంబాబు, మాచర్ల అనిల్ ,రామారావు ,లతోపాటు పలువురు పాల్గొన్నారు.