13 లక్షల దొంగతనం

13 లక్షల దొంగతనం

అల్లాదుర్గం, ముద్ర: అల్లాదుర్గం మండలంలోని గడిపెద్దాపూర్ గ్రామంలో దొంగతనం జరిగింది. గ్రామానికి చెందిన గురుకుల మల్లేశం ఇంట్లోని బీరువాలో దాచుకున్న 13 లక్షల రూపాయలు దొంగతనానికి గురైంది. గురుగుల మల్లేశం అల్లుడు సాయికిరణ్ భూమి కొందామని 13 లక్షల రూపాయలు తన మామ అయిన గురుగుల మల్లేశం ఇంట్లో  బీరువాలో దాచుకున్నాడు.

గురువారం రోజు మల్లేశం కుటుంబ సభ్యులు పత్తి చేనుకు పని కోసం ఇంట్లో మల్లేశం కూతురు దీపికను ఉంచి వెళ్లారు. మధ్యాహ్నం సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు తెరిచి ఉన్న తమ ఇంట్లోకి వెళ్లి బీరువాను తెరిచి అందులోని 13 లక్షలు దొంగిలించి బీరువాకు యధావిదంగా తాళం వేసి వెళ్ళిపోయారు. ఆదివారం ఉదయం డబ్బులు పోయిన విషయం గమనించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.