మధ్యాహ్న భోజన కార్మికులకు పెంచిన జీతాలను అమలు చేయాలి

మధ్యాహ్న భోజన కార్మికులకు పెంచిన జీతాలను అమలు చేయాలి

నేరేడుచర్ల  ముద్ర : మధ్యాహ్నం భోజన కార్మికులకు ప్రభుత్వం పెంచిన వేతనాలను తక్షణమే అమలు చేయాలని సిఐటియు మండల కన్వీనర్ నీలా రామ్మూర్తి  డిమాండ్ చేశారు.  స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో పి శంకరయ్యకు సమ్మె నోటీసులు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొత్త మెనూ కు బడ్జెట్ కేటాయించాలని, పెండింగ్ బిల్లులను తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 8 ప్రకారం వేతనాల ను ఏరియర్స్ తో కలిపి చెల్లించాలని, అక్రమ తొలగింపులు అరికట్టి రాజకీయ వేధింపులు లేకుండా చూడాలన్నారు. వంట షెడ్లు, వంట పాత్రలు తదితర మౌలిక వసతులు కల్పించి, కాటన్ బట్టల యూనిఫామ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సామాజిక భద్రత, ప్రమాద బీమా, పీఎఫ్ ,ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలన్నారు .ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన కార్మికుల మండల నాయకురాలు మొగిలిచర్ల రుద్రమ్మ సిఐటియ నాయకులు కుంకు తిరుపతయ్య , ముత్తమ్మ , తదితరులు పాల్గొన్నారు.