నల్ల బ్యాడ్జ్ లతో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నిరసన

నల్ల బ్యాడ్జ్ లతో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నిరసన

ముద్ర ప్రతినిధి, నిర్మల్: కొన్నేళ్లుగా తాము ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జూనియర్ పంచాయతీ కార్యదర్శులు బుధవారం నిర్మల్ జిల్లా కుబీర్ మండల కేంద్రంలో నల్ల బ్యాడ్జ్ లతో నిరసన వ్యక్తం చేశారు. నాలుగేళ్లుగా పని చేస్తున్నా తమ సర్వీసులను క్రమబద్ధం చేయకపోవటం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 28 నుంచి నిరవధిక సమ్మె కు దిగనున్నట్లు వారు పేర్కొన్నారు. అనంతరం ఎంపీడీఓ కు వినతి పత్రాన్ని అందజేశారు.