కనకమామిడిలో కంటి వెలుగు

కనకమామిడిలో కంటి వెలుగు

మొయినాబాద్: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కనకమామిడి గ్రామంలో మంగళవారంనాడు కంటి వెలుగు కార్యక్రమం జరిగింది. గ్రామస్థులు పెద్ద సంఖ్యలో వచ్చి కంటి పరీక్షలు చేయించుకున్నారు. అవసరమైన వారికి మందులు, కంటి అద్దాలను వైద్య సిబ్బంది పంపిణీ చేశారు. ఆపరేషన్ అవసరమైన వారికి పెద్ద ఆసుపత్రులకు సిఫార్సు చేశారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పి జనార్దన్ రెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు ఏ. గణేష్ రెడ్డి, గ్రామపంచాయతీ వార్డు సభ్యులు కోట్ల బల్వంత్ రెడ్డి, బాలకృష్ణారెడ్డి, నాయకులు మర్రి రవీందర్ రెడ్డి, మల్ రెడ్డి గారి శ్రీనివాస్ రెడ్డి, టి. రాఘవేందర్ రెడ్డి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.